

.jpg)

050 - Ashok Chowdary
100 - Bhavana
020 - Buchibabu B.
050 - Bhaskara Rami Reddy
050 - Panipuri
116 - Shashank
100 - Malakpet Rowdy
025 - Anagha (Baby Rowdy)
050 - Manchu Pallaki
151 - Swetha Gunna
116 - Bhaskara Ramaraju
100 - Nandu
100 - Nishigandha
050 - Anonymous
050 - Venkat Dasika
050 - Ekalingam
050 - Sharada Murali
050 - Sarat
100 - Padma (Mohanaraagaalu) ( Directly to Jeevani )
100 - Korivi Dayyam (Pramaadavanam) ( Directly to Jeevani )
116 - Sri - ( Directly to Jeevani )
050 - RK - ( Directly to Jeevani )
150 - Rajashekar Cheryala ( Directly to Jeevani )
050 - Ranjit Devadas - ( Directly to Jeevani )
150 - Janardhan Bonu -( Directly to Jeevani )
150 - Ravi Piriya ( Directly to jeevani)
మిత్రులారా జీవనికి స్థలం లభించిన సందర్భంలో తదుపరి వ్యూహం కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అనంతపురంలో ఉన్న మిత్రులు అందరూ దయచేసి హాజరు కండి.
ఈ మాటలు అన్నది గ్రామస్థులు. వివరాల కోసం మిమ్మల్ని మాతో పాటు నంద్యాల తీసుకువెళ్తున్నాను. మొదటిసారి వరద సాయాన్ని సుంకేశుల వైపు పంపిణీ చేశాము కాబట్టి ఈ సారి వ్యతిరేక దిశలో నంద్యాల వైపు వెళ్దాం అని అనుకున్నాము. మా వాహనానికి డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. రంగయ్య గారు జెండా ఊపాలి. ఆయనతో నాకు పూర్వ పరిచయం ఉంది. పై స్థాయి అధికారుల్లో నిడారంబరంగా, నిష్కల్మషంగా, అహంభావం లేని వారు అరుదుగా కనబడతారు. వీరిలో ఈయన ప్రథములు. ఆయన బంగ్లా వద్ద కార్యక్రమం. నేను, సతీష్ బయట వాహనానికి బ్యానర్లు కట్టించడం లాంటి పనులు చేస్తున్నాము. ఆలస్యం అవుతుండటంతో సాంబ, శ్రీను, నాగేశ్వర రెడ్డి ఆయనతో మాట్లాడుతున్నారు. మేము బయట రెడీ చేసేలోపు మన వాళ్ళు ఆయనకు మనం చేసిన కార్యక్రమం మొత్తం వివరించారు. వాహనాన్ని రెడీ చేశాక ఆయన జెండా ఊపారు. వాహనాలు కదులుతున్నాయి. రంగయ్యగారు " మీ కార్యక్రమం చూస్తుంటే నేనూ మీతో పాటు రావాలి అనిపిస్తోంది. మీరు వెళ్తున్న గ్రామాలకు కూతవేటు దూరంలో మా ఊరు గోస్పాడు ఉంది. ఈ రోజు ఎలాగూ ఆదివారం. అలాగే డి.ఆర్.డి.ఎ. తరఫున 500 జతల బట్టలు ఇవ్వాలని అనుకున్నాము. నేను వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా " అని అడిగారు. మేము అందరం సంతోషంతో ఆయన్ను ఆహ్వానించాము.
మిత్రులారా ఇంతవరకు వరద బాధితులకు మనం చేసింది తొలిదశ సహాయం. ఇంకా ఎవరైనా సహాయం చేయాలని ఉంటే వారికి అవకాశం... ఆత్మకూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజలు అందరూ జాలర్లు. వారి అందరి వృత్తి చేపలు పట్టడం. వలలు కొట్టుకుపోయి వీరంతా నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన జాలర్లకు వలలు పంపిణీ చేస్తుంది. కొందరు గుర్తింపు లేనివారు ఉన్నారు. వీరికి వలలు కొనివ్వడానికి కర్నూలులో రచయిత మిత్రుడు ఎం.హరికిషన్ ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్క వల 3000/- అవుతుంది. సైజు పెరిగేకొద్దీ వీటి ధర కూడా భారీగా వుంది. ఒక కుటుంబం నిలబడటానికి ఇది సరిపోతుంది. ఇంకా ఎవరైనా సహాయ కార్యక్రమాలు చేస్తుంటే దయచేసి బియ్యం వంటివి ఇక అక్కర్లేదు. ఇలా స్వల్పకాలికంగా కుటుంబాలను పోషించే కార్యక్రమాలను చేపట్టాలని ఆయన చెప్పారు. సంస్థలు స్వంతంగా పంపిణీ చేయాలి అనుకుంటే పూర్తి వివరాలు ఇవ్వగలం మీరే వారికి ప్రత్యక్షంగా ఇవ్వవచ్చు.ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయదల్చుకుంటే దయచేసి సంప్రదించగలరు.
మిత్రులారా నిన్న సాయంత్రం అనంతపురంలోని SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY లో ఫ్రెషర్స్ డే వేడుక జరిగింది. ఈ కాలేజి కరస్పాండెంట్ సాంబశివా రెడ్డి మన జీవని సలహా సంఘం సభ్యులు కూడా. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎం.కె.సింగ్ వచ్చారు. స్టేజి మీద ఆయన కాక మరో ఐదుగురు ఉన్నారు. ఈయనది చివరి ప్రసంగం. మొదట ఐదుగురు ఇంగ్లీషులోనే మాట్లాడారు. కింద ప్రేక్షకులేమో ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకుని వచ్చిన విద్యార్థులు. దాదాపు 600 మంది ఉన్నారు. ఎస్పీ గారు తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టగానే చెవులు చిల్లులుపడెలా కేకలు పెట్టారు పిల్లలు. ఆ తర్వాత నా వంతు వచ్చింది. మనమెట్లాగూ ఇంగ్లీషులో వీకు. ఎక్కడైనా, ఎప్పుడైనా మాట్లాడేదే తెలుగు, మన భాష రాకపోవడం ఎదుటివాడి ఖర్మ. సరే నేను కూడా " వేదికను అలంకరించిన... " అని మొదలు పెట్టగానే పిల్లలు హోరుమని కేకలు వేశారు.
మొత్తం మూడు వాహనాల్లో మేము బయలుదేరాము. ఒక క్యారేజి వాహనం, క్రూయిజర్, కారు. దాదాపు 20మంది. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గుండ్రేవుల వుంది. కర్నూల్ దగ్గర ప్లానింగ్ కోసమని నేను సాంబశివారెడ్డి కారులోకి ఎక్కాను. ఆ తర్వాత మిగతా రెండు వాహనాలు, మేము వేర్వేరు దారుల్లో గుండ్రేవుల వైపు వెళ్ళాము. మా ప్రయాణం దాదాపు తుంగభద్ర నదికి సమాంతరంగా సాగింది.











గాంధీ జయంతి రోజున కర్నూల్ నగరాన్ని వరద ముంచెత్తింది. నేను ఇంకా పేపర్ కూడా చూడలేదు. బ్లాగులు చూస్తుంటే రౌడీ రాజ్యంలో భరద్వాజ గారు వరద బాధితులకోసం మీరు ఏమైనా చేస్తున్నారా అంటూ అడిగారు. చేయగలిగినంత ఆర్థిక సామర్థ్యం మన సంస్థకు ఎక్కడ ఉంది అని నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. భరద్వాజ గారు చూస్తుండగానే విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. 10 గంటల సమయంలో జీవని యూత్ సభ్యుడు రఘు ఫోన్ చేసి, అన్నా వరద బాధితులకోసం ఏమైనా చేద్దాం అని అన్నాడు. సరే బియ్యం పాత బట్టలు సేకరించి ఒక లారీకి పంపుదాం ఈ మాత్రం ఖర్చుకు ఎవరో ఒకరు ముందుకు రాకపోరా అని అకున్నాను. జీవని సభ్యులందరినీ ఫోన్ లో సంప్రదించాను. అందరూ ఓకే అన్నారు.



వరద బాధితుల సహాయం కొసం జీవని బృందం ఈ సారి ఎంతో శ్రమపడింది. ఇప్పుడే వచ్చాము. పూర్తి వివరాలు తర్వాతి టపాలో...




